పోలవరం ప్రాజెక్టును మంత్రి దేవినేని ఉమ సందర్శించారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు పనులపై కేంద్ర జలవనరుల శాఖ నిపుణుల కమిటీ సంతృప్తి వ్యక్తం చేసింది. తొలిసారి పర్యటనకు వచ్చినప్పుడు చేసిన సూచనల ప్రకారం.. ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని నిపుణుల కమిటీ హర్షం వ్యక్తం చేసింది. ఎల్లుండి ఢిల్లీలో పోలవరం ప్రాజెక్టు పనులపై కేంద్రమంత్రి గడ్కరీతో సమావేశ అవుతామని దేవినేని ఉమ చెప్పారు